తిరుపతి : కాంగ్రెస్ అభ్యర్థి పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పుంగనూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు కార్యరక్తలతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో 50 మందికి గాయాలైనాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరో సంఘటనలో ఇదే జిల్లా చౌడేపల్లి మండలం చింతమాకుల వద్ద వాహనం బోల్తాపడడంతో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.