వసంతోత్సవాలు ప్రారంభం
తిరుపతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నిత్యం మధ్యాహ్నం రెండు గటంలకు ఉత్సవ మూర్తులకు ఆలయం సమీపంలోని వైభవోత్సవ మంటపంలో తిరుమంజనం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వర్ణ రథంపై దేవేరులతో కూడిన స్వామివారిని తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం 6 గంటలకు వైభవోత్సవ మంటపంలో ఉత్సవమూర్తులకు ఆస్థానం వేడుక ఉంటుంది. చివరి రోజు గురువారం ఉదయం 8.30 గంటలకు ఉభయనాంచారీ సమేతుడైన మలయప్పస్వామితోపాటు శ్రీరామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ, శ్రీకృష్ణస్వామి, రుక్మిణి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనదలచిన భక్తులు రోజుకు 3 వేల రూపాయల చొప్పున ఆర్జిత రుసుము చెల్లించాల్సి వుంటుంది. ఒక కిట్టెట్ పై 10 మంది భక్తులు హాజరు కావచ్చు.
News Posted: 7 April, 2009
|