గుంటూరు : లోక్ సత్తా అభ్యర్థి తుమ్మల సత్యన్నారాయణ చౌదరి బుధవారం గుండె పోటుతో మృతి చెందారు. గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోక్ సత్తా తరపున పోటీ చేస్తున్న తుమ్మల మరణంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. లోక్ సత్తా కన్వీనర్ జయప్రకాష్ నారాయణ తుమ్మల సత్యనారాయణ మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.