నగరంలో 48 లక్షలు స్వాధీనం
గుంటూరు : రాష్ట్రంలో గురువారం జరగనున్న రెండో విడత ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడింది. దీనితో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తెరవెనుక కార్యకలాపాలకు తెరలేపారు. ఓటర్లను మద్యం, డబ్బులతో ప్రలోభపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా బుధవారం రాత్రి గుంటూరు నగరంలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో 48 లక్షల రూపాయలు దొరికాయి. స్థానిక గీతా రీజెన్సీ హొటల్ పై పోలీసులు దాడి చేసినప్పుడు పిఆర్పీ నాయకుడొకరి నుంచి 48 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ప్రకాశం జిల్లా ఇంకొల్లులో తెలుగుదేశం పార్టీ నాయకుని నుంచి 8.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరాంపురంలో నలుగురు తెలుగుదేశం కార్యకర్తల నుంచి 14 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు.
News Posted: 22 April, 2009
|