గుంటూరు : జిల్లాలోని మాచర్లలో బుధవారం ఉదయం ఒక యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు సమచారం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలానికి చెందిన యువతి పది రోజుల క్రితం మాచర్లలోని మండాదిలో ఉంటున్న తన చెల్లెలి ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం ఒక ఫాస్టర్ తో కలిసి చర్చిలో ప్రార్థన కోసం వెళ్తుండగా దారి కాచి వారిని అటకాయించిన దుండగులు తనను సమీపంలోని నిర్జన ప్రదేశానికి లాక్కుపోయి సామూహికంగా అత్యాచారం జరిపారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.