వెంగమాంబ జయంతి ఉత్సవాలు
తిరుపతి : తిరమలలో నేడు శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలతో పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అనుగ్రహ భూషణం చేస్తారు. తదుపరి వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఆమె రచనల సీడీలను ఆవిష్కరిస్తారు. వెంగమాంబ జయంతి ఉత్సవాలతో పాటు శనివారం నుండి తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను పూర్తి చేసింది.
News Posted: 8 May, 2009
|