తల్లీ పిల్లల ఆత్మహత్య
గుంటారు : కుటుంబ కలహాల వల్ల పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిలకలూరి పేటలో చోటుచేసుకుంది. ఏడు సంవత్సరాల క్రితం ఖదీర్ తో రజియాకు పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడడంతో రజియా పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం తన ఇద్దరు పిల్లలతో సహా ఒంటికి నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన పిల్లలను ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు.
News Posted: 8 May, 2009
|