విజృంభించిన అతిసారం
వరంగల్ : జిల్లాలో అతిసారం మరోసారి విజృంభించింది. కలుషిత నీరు తాగి వర్థన్నపేటలో 50 మంది అనారోగ్యానికి గురైయ్యారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వరంగల్ జిల్లా వర్ధన్న పేటలో అతిసారం ప్రబలడంతో జిల్లా కలెక్టర్ బి.జనార్థన్ రెడ్డి, శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్, మహాకూటమి అభ్యర్థి డా.గుండె విజయరామారావు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.జి.వి.ఆర్ సుబ్బారావు, డా.బోజ్యానాయక్ ఆస్పత్రికి చేరుకొని అస్వస్థతకు గురైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు.
News Posted: 11 May, 2009
|