ఏనుగుల బీభత్సం
చిత్తూరు : పంట పొలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించడంతో వంద ఎకరాల్లోని పంటకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లా పమలనేరు మండలం కాలువపల్లె వద్ద అటవీ ప్రాంత సమీపంలోని పంటపొలాల్లోకి ఏనుగులు దాడి చేశాయి. దీంతో పొలాల్లో కాపలా వున్న రైతులు, సమీపంలోని గిరిజన వాసులు ఒక్కసారిగా కేకలుపెట్టి, దివిటీలు, టార్చిలైట్లు పట్టుకుని ఏనుగల వెంట పెట్టడంతో బెదిరిన ఏనుగులు మరికొంత దూరం పరుగులు తీసి అక్కడ పంట పొలాలను కూడా ద్వంసం చేశాయి. ఈ సంఘటనతో పక్వానికి వచ్చిన మామిడి పంట, చెరకు పిలకలు, కోతకు సిద్ధంగా వున్న వరి, టమోటా పంటలు ధ్వంసమయ్యాయి. ఏనుగులను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిరుపయోగంగా మారడంతో తమ పంట పొలాలకు రక్షణ లేకపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News Posted: 20 May, 2009
|