అనంతపురం : రాష్ట్రస్థాయి మహిళా హాకీ ఛాంపియన్ షిప్ టైటిల్ ను తూర్పుగోదావరి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. గురువారం సాయంత్రం అనంత క్రీడాగ్రామంలో జరిగిన తుదిపోరులో తూర్పుగోదావరి జట్టు కడప పై 3-1 గోల్స్ తేడాతో పోరాడి నెగ్గింది. ఆట ప్రధమార్థంలో కడప జట్టు అద్భుతమైన డిఫెన్స్ తో గోదావరి జట్టును ఇరుకున పడేసింది.అయితే పూర్ణిమ మెరుపు వేగంతో మూడు గోల్స్ చేసి కడప జట్టును నిలువరించింది. అతి కష్టం మీద కడప ఒకే ఒక గోల్ మాత్రమే చేసింది. దీంతో తూర్పుగోదావరి జట్టు ఆరవ రాష్ట్ర స్థాయి మహిళా హాకీ టోర్నీ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది.