వికసించిన విద్యాకుసుమాలు
కడప : పవన్ హైస్కూల్ కు చెందిన విద్యార్థిని ఈ సంవత్సరం పదోతరగతి పరీక్షల్లో టాప్ టెన్ స్థానంలో నిలిచింది. ఈ పాఠశాల నుండి పరీక్షలకు 90 మంది హాజరు కాగా అందులో 80 మంది ప్రథమశ్రేణి, 9 మంది ద్వితీయశ్రేణి సాధించినట్టు కరస్పాండెంట్ జోగిరామిరెడ్డి తెలిపారు. ఎం.తరంగిణి అనే విద్యార్థిని 584 మార్కులు సాధించి రాష్ట్రంలో టాప్ టెన్ లోనూ, జిల్లా టాపర్ గానూ నిలిచిందన్నారు. ద్వితీయ స్థానంలో జమ్మలమడుగులోని బాలాజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థి పి.మన్సూర్ భాష ఇంగ్లీషు మీడియంలో 582మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్ లో నిలిచినట్టు పాఠశాల యాజమాన్యం తెలిపింది.
News Posted: 28 May, 2009
|