కేంద్రంలోనూ `గుంటూరు' పదిలం
గుంటూరు : రాష్ట్ర మంత్రివర్గంలో సింహభాగం పొందిన గుంటూరు జిల్లా కేంద్ర మంత్రివర్గంలోనూ ప్రత్యేక స్థానాన్ని పొందింది. బాపట్ల పార్లమెంట్ సభ్యురాలు పనబాక లక్ష్మిని తన మంత్రి వర్గంలోకి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ లో జిల్లా నుంచి అదుగురికి అవకాశం లభించింది. కొణిజేయి రోశయ్య, కన్నా లక్ష్మీనారాయణ, గాదె వెంకటరెడ్డి, మోపిదేవి వెంకటరమణ రావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ లు అమాత్యులయ్యారు. బాపట్ల నుండి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అనే రాజకీయ వర్గాల నానుడి మరో సారి రుజువైంది.
News Posted: 28 May, 2009
|