శ్రీవారికి అభిద్యేక అభిషేకం
తిరుపతి : కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నేటి నుంచి మూడు రోజుల పాటు వార్షిక అభిద్యేయక అభిషేకం (జ్యేష్ఠ్యాభిషేకం) నిర్వహించనున్నారు. జ్యేష్ఠ్యా నక్షత్రం ముగిసే సమయంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి ఈ ముడు రోజులు వజ్ర, ముత్య, స్వర్ణ కవచాలను సమర్పిస్తారు. ఆలయ కల్యాణ మండపంలో మహా శాంతిహోమం, తిరుమంజనం తదితరాలను నిర్వహిస్తారు. ఈ మూడు రోజులు శ్రీవారికి కవచ సమర్పణానంతరం ఉత్సవర్ల తిరువీధి ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు ఒక్కొక్క రోజు రూ.2వేలు ఆర్జితం చెల్లించవచ్చు. ఈ టిక్కెట్టుపై ఐదుగురికి అనుమతి లభిస్తుంది. తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో 24 కంపార్టుమెంట్లు నిండి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 9 గంటల సమయం పడుతుండడంతో సెల్లార్ దర్శనాలను టిటిడి దేవస్థానం అధికారులు రద్దు చేసి, మహా లఘు దర్శన్నాని కొనసాగిస్తున్నారు.
News Posted: 6 June, 2009
|