తిరుపతి : శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్త జనంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావస్తుండడంతో లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండకు తరలివ్చచారు. ఏడుకొండల స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో సెల్లార్ దర్శనాన్ని రద్దు చేశారు. సర్వదర్శనం కోసం రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరి నిలబడ్డారు.