విత్తన కేంద్రం వద్ద ఉద్రిక్తత
చిత్తూరు : చిత్తూరు జిల్లా కలిజర్ల లో విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. నేడు రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తామని అధికారులు తెలపడంతో అక్కడకు చేరుకున్న రైతలకు నిరాశే మిగిలింది. విత్తనాల పంపిణీలో రైతులకు, అధికారులు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రైతులు వారిపై రాళ్ళతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై వెంకటేశ్వర్లు గాయపడడంతో అక్కడ పరిస్థితిలో ఉద్రిక్తత నెలకొంది.
News Posted: 11 June, 2009
|