మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మృతి
విజయవాడ : మొఘల్ రాజపురంలోని జమ్మిచెట్టు రోడ్డు వద్ద మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మున్సిపల్ కార్మికులు మృతి చెందారు. కాలువను శుభ్రం చేసేందుకు మ్యాన్ హోల్ మూత తెరిచాడు. ఇంతలో హఠాత్తుగా హోల్ లో పడిపోయాడు. అది గమనించిన మరో కార్మికుడు అతడ్ని రక్షించేందుకు మ్యాన్ హోల్ లో కి దిగాడు. ఆ తర్వాత ఇద్దరూ బయటకి రాలేకపోవడంతో లోపల విషవాయువులు వెలువడి ఇద్దరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా వారికి ఒకరి మృతదేహమే కనిపించింది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News Posted: 19 June, 2009
|