విజయవాడ : ఓ రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 30 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక సమాచారం. కృష్ణాజిల్లా తోట్లవల్లూరులోని శ్రీవెంకటేశ్వర రైస్ మిల్లులో బుధవారం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.