తిరుపతి : తిరుపతిలోని ఆంధ్రాబ్యాంక్ లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బాలాజీ కాలనీలోని ఆంధ్రాబ్యాంక్ లో జరిగింది. సిబ్బంది ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నసమయంలో కంప్యూటర్ల నుంచి మంటల రావడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దీంతో బ్యాంక్ లావాదేవీలు నిలిచిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.