రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరవై అయిదు మంది గాయపడ్డారు. మయూరి సెంటర్ వద్ద ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లారీ, బస్సు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
News Posted: 30 June, 2009
|