438 సీట్ల కేటాయింపు
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలోని ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలల్లో 438 సీట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. షెడ్యూల్ కులాల విద్యార్థులకు 156 సీట్లు, ఎస్.టిలకు 120 సీట్లు, బిసిలకు 90 సీట్లు ఎస్ టిలకు 26 సీట్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 27 సీట్లు, మైనారిటీలకు 19 సీట్లు మొత్తం 438 సీట్లను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. పై కేటగిరిలో 14 సీట్లను అంగవైకల్యం కలవారికి కేటాయించినట్లు చెప్పారు. 2009 మార్చిలో జరిగిన 10వ తరగతిలో 450 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థినీ, విద్యార్థుల ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు.
438 సీట్లలో సంక్షేమ హాస్టళ్ళు, ఆశ్రమ పాఠశాలలు, కెజిబివిఎస్ లలో చదివిన వారికి 219 సీట్లు, ప్రభుత్వ మున్సిపల్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలో చదివిన వారికి 109 సీట్లు, ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, జవహర్ నవోదయ పాఠశాలలో చదివిన వారికి 93 సీట్లు, బెస్ట్ అవేలబుల్, బ్రైట్ బాయిస్, విద్యార్థులకు 17 సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్పొరేట్ కళాశాలలో చేరే విద్యార్థులు సంబంధింత పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు నుండి ధరఖాస్తులు పొంది జులై 7వ తేదీలోగా అక్కడే సమర్పించాలని చెప్పారు. ఈ ధరఖాస్తులతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, బోనఫైడ్ సర్టిఫికెట్, నివాసం, కులం, ఆదాయం సర్టిఫికెట్లు జిరాక్స్ ప్రతులతో సమర్పించాలని ఆయన చెప్పారు. అడ్మిషన్లకై జూలై 9 వ తేదీన వరగంల్ నగరంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
News Posted: 2 July, 2009
|