తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు పులకిస్తున్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లన్నీ భక్తులతో కిటకిటలాడుతోంది. 28 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీనివాసుని దర్శనానికి వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. దీంతో అధికారులు మహాలఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో గదులు దొరక్క అసౌకర్యానికి లోనవుతున్నారు.