కల్లపల్లిలో విద్యార్థుల మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. గంగవరం మండలం కల్లుపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అయిగురు విద్యార్థులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మథర్ థెరీసా కాలేజీలో చదువుతున్న విద్యార్థులతో పలమనేరు వెళుతున్న స్కూల్ ఆటోను లారీ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా స్కూల్ కు బయలుదేరిన పిల్లలు మధ్యలోనే మృత్యువాత పడడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 4 July, 2009
|