భగ్గుమన్న పాతపగలు
విజయవాడ : సొసైటీ భూముల వ్యవహారంలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరగడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం రేవులలంకలో సొసైటీ భూముల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దిగిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామంలోఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
News Posted: 7 July, 2009
|