గృహిణి ఆత్మహత్య
విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగానే రాధ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వివరాలకోసం సేకరిస్తున్నారు.
News Posted: 8 July, 2009
|