పప్పు, బియ్యం స్వాధీనం
తిరుపతి : నగరంలో ఆహార ధాన్యాలు అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం అందడంతో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు తిరుపతిలో దాడులు ముమ్మరం చేశారు. దిలీప్ ట్రేడర్స్ వద్ద ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున దాచి ఉంచిన ఆహార ధాన్యాలైన పప్పు, బియ్యాలను సీజ్ చేసారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ పప్పు, బియ్యాల విలువ రూ.15 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.
News Posted: 10 July, 2009
|