తిరుపతి : తమకు రక్షణ కల్పించాలని రుయా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను శనివారం విరమించుకున్నారు. తమపై దాడి చేసినవారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించుకున్నారు. గత మూడు రోజుల క్రితం మృతుడు గోపీ బంధువులు తమపై దాడికి పాల్పడడంతో దానికి నిరసనగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం తెలిసిందే.