నాగావళిలో పడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం: ఒరిస్సా-కోస్తా వెంబడి పయనిస్తున్న వాయుగుండం మరింత బలపడడంతో ఒరిస్సా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార క్యాచ్ మెంట్ లలో భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటివరకూ 45 వేల 738 క్యూసెక్కుల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. వంశధార కొత్త బ్యారేజీ 22 గేట్లు ఎత్తివేసి అదనపు జలాలాను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు తోటపల్లి ప్రాజెక్టులో 30 వేల క్యూసెక్కులనీరు వచ్చిచేరింది. అకస్మాత్తుగా వరద నీరు వచ్చి చేరడంతో ఎచ్చర్ల మండలం తమ్మినాయుడు పేట వద్ద నాగావళి నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందగా, 20 గేదెలు కొట్టుకొనిపోయాయి.
News Posted: 14 July, 2009
|