ఆలయాల వద్ద భద్రత పెంపు
విశాఖపట్నం : విశాఖ జిల్లాకు ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ప్రవేశించే అవకాశం ఉన్నందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం పోలీస్, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ సిబ్బంది బీచ్ రోడ్డ్ లో విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీసులు అప్రమత్తమై అన్ని ఆలయాల వద్ద భద్రతను పెంచారు. అశీల్ మెట్టలోని సంపత్ వినాయక ఆలయం వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మొహరించారు.
News Posted: 15 July, 2009
|