విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా జి.కోడూరులో 334.95 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి గీతారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఇండస్ట్రియల్ పార్క్ కు క్యాబినెట్ ఆమోదించిందన్నారు.