విశాఖపట్నం : విశాఖ జిల్లా యలమంచిలి రేవు పోలవరం వద్ద వేటకు వెళ్ళిన మత్స్యకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా మరొకరు గల్లంతు అయినట్లు తెలియవచ్చింది. సమాచారం తెలుసుకున్న కోస్టు గార్డులు గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్చలు చేపట్టారు.