సముద్రంలో దూకిన అత్త
విశాఖపట్నం : కోడలు ఈసడింపులు, వేధింపులు భరించలేక ఓ అత్త సముద్రంలోకి దూకి ఆత్మహత్యాత్నానికి పాల్పడింది. విశాఖ జిల్లాలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలతో ఆమె బయటపడింది. సత్తెమ్మ అనే వృద్ధురాలు తన కోడలు పెట్టే బాధలను భరించలేకే ఆత్మహత్యకు పూనుకున్నాని తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
News Posted: 18 July, 2009
|