18కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం రైల్వే కాలనీలో మంగళవారం 18 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలేజీ విద్యార్థులకు అక్రమంగా గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న వీరు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో 18 కేజీల గంజాయి బయటపడింది. ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు.
News Posted: 21 July, 2009
|