బిజేపి `పప్పు' సత్యాగ్రహం
విశాఖపట్నం : రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కందిపప్పు ధరలు ఆకాశాన్నంటడంతో కందిపప్పు ధరని నియంత్రించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో మంగళవారం పప్పు సత్యాగ్రహం నిర్వహించారు. తలపై ఖద్దరు టోపి, మెడలో పప్పు దినుసుల సంచులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జివిఎంసి కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ నేతలు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు శాంతియుతంగానే తాము సత్యాగ్రహం చేస్తున్నట్లు తెలిపారు.
News Posted: 21 July, 2009
|