1నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు
తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీనుండి మూడురోజులు పాటు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ కైంకర్యాలలో, సేవా నిర్వహణలో తెలిసో, తెలియకో జరిగే పొరపాట్లకు ప్రాయశ్చిత్తార్థం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు జులై 31న అంకురార్పణ జరగనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.
News Posted: 23 July, 2009
|