విశాఖపట్నం : డబ్బు కోసం విద్యార్థిని ఆగంతకులు కిడ్నాప్ చేసిన సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖలోని పోలెక్స్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి లోకేష్ ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. అనంతరం లోకేష్ తల్లిదండ్రులకు వారు ఫోన్ చేసి కొంత డబ్బును డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ కిడ్నాప్ ఉదంతంపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.