షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం
నెల్లూరు : జిల్లాలోని చిన్నబజార్లో నూతనంగా నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ను హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఐడిఎస్ఎంటి పథకం కింద 38 దుకాణాలను ఇక్కడ నిర్మించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా వికలాంగులు, వితంతువులకు పింఛన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ కండలేరు ముంపు వాసులకు నష్టపరిహారం కింద ఇళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈమేరకు చెక్కులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణయ్య నెల్లూరు ఎంపి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగనూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, ఎంఎల్ సి బూదాటి రాధాకృష్ణయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లసిరి గోపాలరెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి, జిల్లా ఎస్పి బి.మల్లారెడ్డి, కలెక్టర్ కె.రాంగోపాల్, కమిషనర్ టిఎస్ఆర్.ఆంజనేయలు, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.
News Posted: 3 August, 2009
|