నవరాత్రులకు కసరత్తు
విజయవాడ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాటుకోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి చెప్పారు. ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీసు, మునిసిపల్, ఎండోమెంట్, ఫైర్, ఉడా, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులందరూ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. ఆయన విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రెండుసంవత్సరాల కిందట భవానీ దీక్షల విరమణలో జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని దసరా నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని ఆదేశించినట్లు రమాకాంత రెడ్డి చెప్పారు.
News Posted: 4 August, 2009
|