విజయనగరం: అవినీతి నిరోధక శాఖ వల్లో మరో చేప చిక్కింది. ఓ లబ్ది దారుడి వద్ద లంచం తీసుకుంటూ హౌసింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఎక్కింపేట గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ గణపతిరావు పార్వతీపురం మండలం మెట్టపల్లిలో లబ్ధి దారుడి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబట్టాడు. కేసు నమోదు చేసి గణపతిరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.