ఏయూలో ఆన్సర్ షీట్ల మార్పు
విశాఖపట్నం : ఏయీ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో జవాబు పత్రాలను మారుస్తున్న ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. జవాబు పత్రాలలో కొన్నింటిని మార్చుతున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో కొన్ని రోజుల నుండి ఉద్యోగులపై నిఘా వేశారు. ఈ-5 సెక్షన్ రామకృష్ణారెడ్డి, కాలేషా అనే ఇద్దరు ఉద్యోగులు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన జవాబుపత్రాలను మార్చుతుండగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సామ్రాజ్యలక్ష్మి, పరిక్షీల డీన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిని ఉపకులపతి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన వెంటనే స్పందించి వారిని సస్పెండ్ చేశారు. ఇక్కడ జరిగిన వ్యవహారాన్ని ఏయూ అధికారులు సదరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి చెప్పడంతో అక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు.
News Posted: 8 August, 2009
|