ఏనుగుల బీభత్సం
శ్రీకాకుళం: గ్రామాల్లోకి గుంపులు గుంపులుగా ప్రవేశించిన ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లాలోని సీతం పేట, పాలకొండ మండలాల్లోని చినోటిపల్లి, పెదకోటిపల్లి, గుడివాడ గ్రామాల్లో ప్రవేశించిన పంటపొలాలను నాశనం చేశాయి. సుమారు 25నుంచి 35 ఎకరాల వరకు పంటపొలాలకు నష్టం వాటిల్లింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురౌతున్నారు. ఏనుగులను అడవుల్లోకి పంపించేందకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
News Posted: 13 August, 2009
|