ప్రారంభమైన విగ్రహాల సందడి
విశాఖపట్నం : మరో అయిదు రోజుల్లో వినాయక చవితి పండుగ కావడంతో విగ్రహాల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. గణేష్ విగ్రహాల తయారీకి ఎంతో పేరు గాంచిన యలమంచిలి నుండి విశాఖపట్నం, గాజువాక, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా, కోల్ కతా తదితర ప్రాంతాలకు విగ్రహాలను ఎగుమతి చేస్తారు. ఐదు రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ఇక్కడ వినాయకుని విగ్రహాలను తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ సుమారు 70 వేల నుంచి 80 వేల వరకు విగ్రహాలు తయారు చేస్తుంటారు. వ్యాపరస్థులు కొంతమంది ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి విక్రయిస్తుంటారు. మరికొంత మంది తయారీదారులు కూడా ఇతర ప్రాంతాలకు విగ్రహాలను తీసుకువెళ్ళి అమ్ముతుంటారు.
News Posted: 18 August, 2009
|