విజయనగరం : విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పతివాడ వీఆర్వో కృష్ణారావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఓ రైతు పతివాడ వీఆర్వోని కలవగా మూడు వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో దిక్కుతోచని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటున్న వీఆర్వో ను పట్టుకున్నారు.