వెడెక్కిన టెక్కలి
విశాఖపట్నం : టెక్కలి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల అభ్యర్తుల నామినేషన్ ఘట్టం విజయవంతం కావడంతో ఇక ప్రచారంపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. దీంతో టెక్కలి అసెంబ్లీ ఉపఎన్నిక వేడెక్కింది. టెక్కలిలో తెలుగుదేశం ఓట్లు పెంచుకునేందుకు కింజారపు సోదరులు కసరత్తు చేస్తున్నారు. ప్రజారాజ్యం అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ కు పార్టీ అధినేత చిరంజీవే స్వయంగా రావడంతో ఆ పార్టీలోఉత్సాహం పుంజుకుంది. తన బలాన్ని పెంటుకుని దేశం, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండోసారి అధికార పగ్గాలను సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వసనీయతను తమ పార్టీవైపే ఉందని నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓటరుని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్తులు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. దీంతో టెక్కలి లో ఉన్నఎన్నికల సందడి మొదలైంది.
News Posted: 26 August, 2009
|