18 నుంచి దసరా సెలవులు
విశాఖపట్నం : నగరంలోని ప్రభుత్వ, మున్సిపల్ కార్పొరేషన్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈనెల 18 నుంచి 29 వరకు దసరా సెలవులను ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు సంబంధింత ఉత్తర్వులు ఆయా పాఠశాలలకు అందాయి. 30వ తేదీన పాఠశాలలను పున:ప్రారంభం చేయాలని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది.
News Posted: 8 September, 2009
|