గోడౌన్లపై అధికారుల దాడులు
విజయవాడ : కృష్ణాజిల్లా కూచిపూడిలో గోడౌన్లపై శుక్రవారం ఆర్డీవో ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 15 లక్షల రూపాయల విలువైన అపరాలను, పురుగుమందులను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్లను అధికారులు సీజ్ చేశారు. గోడౌన్ల యాజమాన్యంపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 11 September, 2009
|