అల్లుడి పై అత్త దాడి
విశాఖపట్నం : అత్తింటికి వచ్చిన అల్లుడి పై భార్య, అత్త దాడి చేశారు. విశాఖ జిల్లా మాడుగుల మండలంలో జమ్మాదేవిపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొన్నేళ్ల క్రితం తాతారావుకు నాగమణితో వివాహ మైంది. భార్యాభర్తల మధ్య గొడవలు కొద్ది నెలలుగా జరుగుతున్నాయి. దీంతో తాతారావు కూలి పనుల కోసం మరో జిల్లాకు వలసవెళ్లిపోయాడు. కుమార్తెకు అనారోగ్యమని అత్త సమాచారం ఇవ్వడంతో శనివారం స్వగ్రామం చేరుకున్నాడు. భార్యను తీసుకెళ్లడానికి ఆదివారం అత్తవారింటికి వచ్చాడు. తనపై దౌర్జన్యంగా అత్త, భార్య నాగమణి యాసిడ్ తో దాడి చేశారని పోలీసులకు తెలిపాడు. అయితే, తాము యాసిడ్ పోయలేదని, పొయ్యిమీద ఉన్న వేడి నూకజావ పోసినట్టు తాతారావు భార్య నాగమణి తమకు చెప్పినట్టు మాడుగుల ఎస్ఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. చికిత్స కోసం బాధితుడిని మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
News Posted: 21 September, 2009
|