ఇడుపులపాయలో జన ప్రవాహం
కడప : వైఎస్ తనయుడు జగన్ ఇడుపులపాయకు చేరుకుని తండ్రి సమాధి వద్ద సోమవారం నివాళులు అర్పించారు. జగన్ తో పాటు వైఎస్ సతీమణి విజయలక్ష్మీ, కూతురు షర్మిలా కూడా వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జగన్ ఇడుపులపాయకు చేరుకోవడంతో వైఎస్ అభిమానులు తండోపతండాలుగా అక్కడకు చేరుకుని జగన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కడపజిల్లా ఇడుపులపాయ జనప్రవాహంతో కిక్కిరిసిపోయింది. తనను పరామర్శించేందుకు వచ్చిన అభిమానులను వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారు.
News Posted: 21 September, 2009
|