రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
విజయనగరం : గోదుమల లోడుతో వెళ్తున్న లారీ కొండను ఢీ కొనడంతో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో పది మంది గాయపడ్డారు. పాచిపెంట మండలం ఘాట్ రోడ్డులో ఎఓబీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రాయగడ నుంచి విజయనగరం వెళ్తున్న గోధుమల లోడు లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండను ఢీ కొన్నట్లు తెలుస్తోంది.
News Posted: 9 October, 2009
|