బాధితులకు ఎమ్మెల్యేల విరాళం
విశాఖపట్నం : వరద ముంపును ఎదుర్కొన్న బాధితులకు విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తరఫున 35 లక్షల రూపాయల విరాళాన్ని అందజేస్తున్నట్లు మంత్రి బాలరాజు తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా ఇంతటి భారీ విపత్తు సంభవించడంతో ప్రభుత్వ, పార్టీల సహాయం కాకుండానే తాము వ్యక్తిగతంగా ఈ మొత్తాన్ని సేకరించామని ఆయన చెప్పారు.
News Posted: 12 October, 2009
|