కలెక్టరేట్ ఎదుట ధర్నా
అనంతపురం : ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ కలెక్టరేట్ల వద్ద టిడిపి, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారంనాడు ధర్నాలు జరుగుతున్నాయి. ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యాపారంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సంబంధం ఉందని కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నారు. అనంతపురం జిల్లా ప్రజానీకం అభివృద్ధి కోసం వాడాల్సిన మైనింగ్ సంపదను ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అక్రమాలకు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారంటూ వారు ధ్వజమెత్తారు.
News Posted: 16 November, 2009
|